బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్..!

బర్త్ డేకి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్..!

Last Updated : Oct 16, 2018, 07:50 PM IST
బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్..!

'బాహుబలి’ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దాదాపు పూర్తికావొస్తుంది. అలాగే ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు.

ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ రోజున ప్రభాస్ మూవీకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రభాస్ ఒకే రోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం టీజర్ రిలీజవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్‌‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను కూడా అదే రోజు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.

అయితే నిజానికి ఆ రోజు ‘సాహో’ టీజర్ రిలీజ్ అవ్వడం లేదని.. ఈ సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారని మరో వార్త వెలువడింది. ముందుగా మేకింగ్ వీడియో, ఆ తరవాత కరెక్ట్ టైమ్ చూసుకుని టీజర్‌ని విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారట. అయితే చాలా మంది అభిమానులు మాత్రం 'సాహో' మూవీకి సంబంధించిన అప్ డేట్ తప్పక వస్తుందని చెబుతున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సాహో'  సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ నటిస్తుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. ఈ సినిమాకి శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Trending News