అమ్మకానికి రూ.2000 కోట్ల బిల్డింగ్ !

జేఎన్‌పీటీకి తమ పాత భవనాన్ని అమకానికి పెడుతున్న ఎయిర్ ఇండియా

Last Updated : Sep 10, 2018, 05:11 PM IST
అమ్మకానికి రూ.2000 కోట్ల బిల్డింగ్ !

భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా లిమిటెడ్ కు చెందిన  రూ.2000 కోట్ల విలువైన పాత ప్రధాన కార్యాలయ భవనాన్ని జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు(జేఎన్‌పీటీ)కు అమ్మకానికి పెడుతున్నట్టు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వచ్చే మార్చి చివరినాటికల్లా ఈ డీల్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఈ ఖరీదైన భవనం ఉంది. ప్రస్తుతం జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, ఎయిర్ ఇండియా అధికారులు వేర్వేరుగా ఈ భవనం విలువను అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారని తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పినట్టుగా లైవ్ మింట్ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. 

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఎయిర్ ఇండియా.. ఆ కష్టాలను అధిగమించేందుకు ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టింది. 23 అంతస్తులు ఉన్న ఈ భవనం మొత్తం 10,000 చదరపు అడుగులకుపైగా వైశాల్యంలో విస్తరించి ఉంది.

Trending News