కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం; ఐదుగురు మృతి

కేరళలోని కొచ్చిన్‌లో గల షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మరమ్మతుకు వచ్చిన నౌకలో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Feb 14, 2018, 02:58 PM IST
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రమాదం; ఐదుగురు మృతి

కేరళలోని కొచ్చిన్‌లో గల షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మరమ్మతుకు వచ్చిన నౌకలో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)కి చెందిన సాగర్‌ భూషణ్‌ నౌకను మరమ్మతుల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉంచారు.

మంగళవారం సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నౌకలో వాటర్‌ ట్యాంక్‌లో ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News