EPFO: పీఎఫ్ వడ్డీ మొత్తం ఒకే సారి చెల్లించనున్నారు

Last Updated : Dec 9, 2020, 10:17 PM IST
    1. ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ ఉన్న ఉద్యోగులకు శుభవార్త.
    2. ఇకపై మీ ఈపీఎఫ్‌ఓ ఫండ్ వడ్డీ ఒకేసారి మీ పీఎఫ్ ఎకౌంట్‌లోకి చేరుకోనుంది.
    3. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించడం వల్ల ఇలా జరగనుంది అని తెలుస్తోంది.
EPFO: పీఎఫ్ వడ్డీ మొత్తం ఒకే సారి చెల్లించనున్నారు

Provident Fund | ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ ఉన్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీ ఈపీఎఫ్‌ఓ ఫండ్ వడ్డీ ఒకేసారి మీ పీఎఫ్ ఎకౌంట్‌లోకి చేరుకోనుంది. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించడం వల్ల ఇలా జరగనుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం షేర్ మార్కెట్ ఆల్‌టైమ్ హైలో ఉంది. 

Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

దీంతో ఇదే మంచి సమయం అనుకున్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లను వినియోగించనుంది. దీంతో EPFO కు మంచి లాభాలు రానున్నాయి. దాంతో దానికి సంబంధించి వడ్డీని ఖాతారుల ఎకౌంట్స్‌లో డైరక్ట్‌గా జమ చేయనున్నారు అని సమాచారం. 

Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి

ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీని ఏకమొత్తంగా పీఎఫ్ ఖాతాదారులకు అందించేందుకు ఆర్థిక శాఖకు లేఖ రాసినట్టు సమాచారం. దీనికి త్వరలో భారత ప్రభుత్వ (Indian Government) ఆమోదం లభించే అవకాశం లభించే అవకాశం ఉందని సమాచారం. మొదట 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని చెల్లిస్తారని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News