వామ్మో.. ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర

మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరో స్థాయికి చేరింది. ఏకంగా విదేశాల్లోని కరోనా కేసులు, కరోనా మరణాలను సైతం మహారాష్ట్ర దాటేయడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం వెయ్యి కేసులు, వంద మరణాలతో పరిస్థితి భీకరంగా మారింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 8, 2020, 01:03 PM IST
వామ్మో.. ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర

కరోనా మహమ్మారి (CoronaVirus)తో పోరాడుతున్న దేశాలలో భారత్ ఒకటి. కరోనా కేసులలో ప్రపంచ దేశాలో ఐదో స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా భారత్‌లో కోవిడ్19 (COVID-19) తీవ్రతను అధికంగా ఎదుర్కొటున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నేపథ్యంలో ఏకంగా చైనాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులను మహారాష్ట్ర (Maharashtra CoronaVirus Cases) అధిగమించింది.  సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

చైనాలో ఇప్పటివరకు దాదాపు 84వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో సోమవారం (జూన్ 8న) ఉదయం నాటికి 85,975 కోవిడ్ పాజిటివ్ కేసులున్నాయి. చైనాలో కరోనా మరణాలు 4,638 వద్ద నిలిచిపోగా, కేవలం మహారాష్ట్రలో 3060 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకోవడం గమనార్హం. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కేసులు, వందకు పైగా మరణాలతో మహారాష్ట్ర ఇతర దేశాల కరోనా మరణాలను దాటేస్తుండటం విచారకరం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

Trending News