Monkeys Water Tank: నందికొండ మున్సిపాలిటీలో కోతులు మృతిచెందిన నీటి ట్యాంకర్ నుంచి అలాగే తాగునీళ్లు ప్రజలకు వదలడంపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో ఈ ఘటన జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీళ్లు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రాజకీయాలపై దృష్టి సారించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నీటి ట్యాంక్ను పరిశీలించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారని విమర్శించారు. మోదీని గెలుపిస్తుందే రాహుల్ గాంధీ అని అన్నారు.
Komatireddy Venkat Reddy: శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
Jagadish Reddy Press Meet : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఇంకా ఆరంభించక ముందే బీజేపిలో వణుకు మొదలైందని.. ఆ భయమే వారి చేత ఇలా మాట్లాడిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
EC Action on Jagadish Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసి ఈ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
Boora Narsaiah Goud: 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించిన బూర.. 2019లో మాత్రం వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బూర భువనగిరి ఎంపీగా పోటి చేసినా.. ఆయన సొంతూరు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది.
Munugode Bypoll: బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది.
Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగుతుండగానే.. అదే మండల జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తన అనుచరులతో సమావేశమై అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.కర్నాటి బాటలోనే ఇటీవల బీజేపీలో చేరిన మరికొంత మంది నేతలు తిరిగి అధికార పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది
Munugode Bypoll :మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విజయదశమికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు.
Munugode Bypoll : తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కావడంతో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. జగదీశ్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.
Jagadish Reddy: జగదీశ్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు. అయితే జగదీశ్ రెడ్డి ఆహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు, చండూరు జడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం. అతనితో పాటు గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య బీజేపీలో చేరారు
Munugode Bypoll: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.