CM KCR Speech: దేశంలో రైతు బంధును సృష్టించిందే నేను.. రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..?

Praja Ashirvada Sabha in Dharmapuri: దేశంలో రైతు బంధును సృష్టించే తాను అని.. గతంలో రాబంధులు తప్పా.. రైతు బంధు లేదని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..? అని ధర్మపురి ప్రజా ఆశీర్వద సభలో ప్రశ్నించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 2, 2023, 11:54 PM IST
CM KCR Speech: దేశంలో రైతు బంధును సృష్టించిందే నేను.. రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..?

Praja Ashirvada Sabha in Dharmapuri: ప్రజల దగ్గరున్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అని.. మన భవిష్యత్తును నిర్ణయించి, తలరాతను మారుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆషామాషీగా వేయకండని ప్రజలకు సూచించారు. పంటి కంటకుండా మింగుదామని గతంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ ఒక ఛాన్స్ ఇవ్వండని అడుగుతోందని.. ఎన్నోసార్లు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చినా చేసిందేమి లేదన్నారు. ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నాడు గోదావరంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడనే ఉండేదని.. ధర్మపురిలో గోదావరి నది ఉన్నదన్న విషయాన్ని కూడా మరిచారని అన్నారు. ఇక్కడ గోదావరి పుష్కరాలను నిర్వహించాలని డిమాండ్ చేసేదాక ఇక్కుడున్నా ఏ నాయకులకూ సోయి లేకుండా పోయిందన్నారు.

కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

==> కొత్త రాష్ట్రంలో నాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీరు లేదు, ప్రజల వలస బతుకులు, ఎక్కడ చూసినా అంధకారం.
==> నేడు మంచినీళ్ల సమస్య లేదు, దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ.
==> రైలు, ఓడరేవులు, విమానాలు, కరెంటు తదితర రంగాలన్నింటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేశాయి.
==> మోదీ కరెంటును ప్రైవేట్ చేసి.. మోటార్లకు మీటర్లు పెట్టి ఖచ్చితంగా వసూలు చేయాలని నాకు చెబితే సచ్చినా సరే మీటర్లు పెట్టనని చెప్పాను.
==> మోటార్లకు మీటర్లు పెట్టకుంటే సంవత్సరానికి 5వేల చొప్పున మొత్తం 25 వేల కోట్లు మనకు రావాల్సినవి మోదీ ఇవ్వలేదు.
==> భవిష్యత్తులో కూడా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టను.
==> విద్యారంగంలో అన్ని వర్గాల ప్రజలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం.
==> గతంలో రైతులకు అప్పులుంటే వాళ్ల తలుపులు బ్యాంకోల్లు తీసుకపోయినరు తప్ప రైతులకు ఆర్థిక సాయం చేయాలని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ ఆలోచించలేదు.
==> ‘రైతు బంధు’ను దేశంలో సృష్టించిందే కేసీఆర్.
==> గతంలో రాబంధులు తప్ప ‘రైతు బంధు’ లేదని మీరు గమనించాలె. చర్చించాలి.
==> ఇవ్వాల రైతు బంధుతో రైతులందరూ అప్పులు కట్టుకుంటూ, సొంత పెట్టుబడి పెట్టుకుంటూ, మందు బస్తాలకు మూడు, నాలుగు రూపాయల వడ్డీ కూడా లేకుండా, దళారుల బాధ లేకుండా సంతోషంగా ఉన్నారు.
==> బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఉచిత కరెంటును ఇస్తూ, ధాన్యాన్ని మొత్తం కొంటున్నది.
==> ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా?
==> ధరణి పోర్టల్ రాకముందే అనేక భూమి గొడవలు ఉండేవి. ధరణి వచ్చాక రైతుల భూములు భద్రంగా ఉన్నయ్.
==> ధరణితో దళారీలు, లంచాలు లేకుండా మండల కేంద్రాల్లోనే వెంటనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.
==> విధివశాత్తూ రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా డబ్బులు ధరణి ద్వారానే వస్తున్నాయి.
==> రైతులు పంటనమ్మితే వచ్చే డబ్బులు డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్లలో పడుతున్నది.
==> కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తే రైతులకు వచ్చే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఎట్లొస్తయ్?
==> కాంగ్రెస్ మాటలు విని ఆగమాగమైతే కైలాసం ఆటల మళ్లీ పెద్దపాము మింగినట్లైతది.
==> కాంగ్రెస్ రాజ్యమే పైరవీకారులు, దళారుల రాజ్యం. వాళ్లొస్తే ధరణిని తీసేస్తరు జాగ్రత్త.
==> గతంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలితే రైతుల దగ్గర రెండు వేలు, మూడు వేలు వసూలు చేసేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా చేసినం.
==> రైతు బంధు పెట్టుమని నాకెవరూ దరఖాస్తు ఇవ్వలేదు. దళితబంధు పెట్టుమని నన్నెవరూ అడగలేదు. నేనే స్వయంగా పెట్టిన.
==> రైతులు భిక్షగాళ్లు కాదు.. అన్నంపెట్టే అన్నదాతలు
==> కొప్పుల ఈశ్వర్ 80 వేల మెజార్టీతో గెలువగానే ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి దళితబంధును  ఒక్కసారిగా మంజూరు  చేస్తా.
==> తరతరాలుగా దోపిడీ, అణిచివేతలకి గురైన దళితుల సంక్షేమం కోసమే దళిత బంధును పెట్టినం.
==> భారతదేశంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా దళిత బంధు లాంటి పథకాన్ని పెట్టలేదు. ఆలోచించలేదు.
==> రాష్ట్రాభివృద్ధికి ప్రామాణికమైన తలసరి ఆదాయం, విద్యుత్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
==> కుల మతాలు చూడకుండా అందర్నీ కలుపుకుంటూ పదేండ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా చేశాం.
==> ధర్మపురి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించాం. అవసరమైతే మరిన్ని నిధుల్ని కేటాయిస్తాం.
==> కార్మికునిగా పనిచేసి ఎదిగినవాడు, సౌమ్యుడు అయిన కొప్పుల ఈశ్వర్ ను గెలిపిస్తే ధర్మపురి నియోజకవర్గం మరింత అభివృద్ధిని సాధిస్తుంది.
==> కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News