PRC approved: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు Good news.. పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2021, 06:56 AM IST
PRC approved: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు Good news.. పీఆర్సీకి కేబినెట్ ఆమోదం

PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. 30 శాతం పెంపుతో పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించినప్పటికీ.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వచ్చింది. 

అయితే ప్రస్తుతం పరిస్థితిలో కొంత మార్పు రావడం, అన్ లాక్ దిశగా చర్యలు మొదలు కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మళ్లీ మెరుగుపడనున్నాయనే ఆకాంక్షతో మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో పీఆర్సీ అమలుకు సైతం సర్కారు పచ్చజండా ఊపింది. కాకపోతే, హెచ్ఆర్ఏ విషయంలోనే పీఆర్సీ సూచించిన అంశాలను కేబినెట్ ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర ఖజానాపై నెలకు రూ. 1000 కోట్ల అదనపు భారం పడనుంది. 

Also read : Telangana: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

Who is eligible for 30% fitment ఎవరెవరికి వర్తిస్తుంది ?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు (Government employees, Contract, out sourcing employees and pensioners) కూడా ఈ 30% ఫిట్‌మెంట్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పెరిగిన వేతనాలు జూన్ నెల నుంచే ఉద్యోగుల చేతికి అందనుంది. ఇంకా చెప్పాలంటే జులై మొదటి వారంలో ఉద్యోగులు పొందే జూన్ నెల జీతంలో పెరిగిన శాలరీ ఉంటుదన్నమాట.

Notional benefit, monitory benefit, cash benefit: నోషనల్‌ బెనిఫిట్‌, మానిటరీ బెనిఫిట్‌‌, క్యాష్ బెనిఫిట్
నోషనల్‌ బెనిఫిట్‌ని 2018 జూలై 1 నుంచి, మానిటరీ బెనిఫిట్‌‌ని 2020 ఏప్రిల్‌ 1 నుంచి, జీతాల్లో మార్పుని (క్యాష్ బెనిఫిట్) 2021 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్టు కేబినెట్ స్పష్టంచేసింది. మరో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. 

Also read: TS cabinet meeting: కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు

Pensioners arrears: పెన్షనర్లకు బకాయిల చెల్లింపు
పెన్షనర్లకు 2020 ఏప్రిల్‌ 1 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించాల్సి ఉన్న బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.

అంతేకాకుండా కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు (KGBV Contract employees) సైతం 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తింపజేయాలని ప్రభుత్వం క్యాబినేట్ భేటీలో (TS Cabinet meeting) నిర్ణయం తీసుకుంది.

Also read: Telangana lockdown timings: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News