Addala Aishwarya Case: సీరియల్ నటి ఐశ్వర్య కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరింపులు..

Tollywood Serial Actress Aishwarya: సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అడ్డాల ఐశ్వర్య,  ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 15, 2024, 10:10 AM IST
  • సీరియల్ నటి మాజీ భర్త పై కేసు నమోదు..
  • రమేష్ బాబు, ఐశ్వర్య ఫోటోలు పెడతానంటూ బెదిరింపులు..
Addala Aishwarya Case: సీరియల్ నటి ఐశ్వర్య కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరింపులు..

Big Twist In Serial Actor Addala Aishwarya Case: ప్రముఖ సీరియల్ నీటి అడ్డాల ఐశ్వర్య కేసులో రోజు రోజుకు ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పెళ్లాయినప్పటి నుంచి తన భర్త పిన్నింటి శ్యామ్ వేధిస్తున్నాడని, ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తన భార్య ఒక రియల్ ఎస్టెట్ బిజినెస్ మెన్ తో ఎఫైర్ కొనసాగిస్తుందని, అడ్డంగా దొరికి పోయి నాపై తప్పులు కేసులు బనాయించినందని భర్త శ్యామ్ కుమార్ వాదిస్తున్నాడు. కాగా  కాపు మ్యాట్రిమోనీ ద్వారా శ్యామ్ కు, ఐశ్వర్యకు పెళ్లి జరిగింది. పెళ్లై కొద్ది రోజులకే ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఐశ్వర్య పెళ్లి తన 25 లక్షల డబ్బులను దోచుకుని వెళ్లిపోయిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. 

Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

ఇదిలా ఉండగా.. తనను పెళ్లి పేరుతో మోసం చేశారని, స్పాలో పనిచేయాలని భర్త శ్యామ్ వేధించాడని ఐశ్వర్య వాపోయింది. ఇదిలా ఉండగా.. ఐశ్వర్యకు తాగుడు అలవాటు ఉందని, రియల్ ఎస్టేట్ వ్యాపారి, రమేష్ బాబుతో ఎఫైర్ కొనసాగిస్తుందని భర్త ఆరోపిస్తున్నాడు. అదే విధంగా ఆమె బీరువాలో సిగరెట్లు, బీడీలను కనుగొన్నట్లు కూడా శ్యామ్ ఆరోపిస్తున్నాడు. ఇక వీరిద్దరు అనేక మీడియా వేదికల మీద ఒకరిపై మరోకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే ఐశ్వర్య మాజీ భర్తపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదైంది. 2023, సెప్టెంబరు 6 న ఐశ్వర్యకు పెళ్లి జరిగింది.  ఈక్రమంలో వీరి మధ్య గొడవలు పీక్స్ కు చేరాయి. శ్యామ్ బిజినెస్ మెన్ శ్యామ్ కుమార్ కు ఫోన్ చేసి, తనకు 10 లక్షలు ఇవ్వకుంటే ఐశ్వర్యతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేస్తానంటూ కూడా బెదిరింపులకు దిగాడని తాజాగా, వ్యాపార వేత్త రమేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Read More: BS Yediyurappa: మైనర్ బాలికపై మాజీ సీఎం అత్యాచారం.. కన్నతల్లి వేడుకుంటున్నా కూడా..

దీన్నిరమేష్ బాబు పెద్దగా పట్టించుకోక పోవడంతో, శ్యామ్ కుమార్ అన్నపనిచేశాడు. ఈ నెల 12 ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాది అక్టోబరు 9 న తన భార్య రమేష్‌ బాబుతో గదిలో ఉన్నట్లు శ్యామ్ తెలిపాడు. కానీ ఆ నెలలో తాను.. 4 నుంచి 14 వరకు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు రమేష్ బాబు స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా శ్యామ్ కుమార్ ప్రయత్నిస్తున్నాడంటూ రమేష్ బాబు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News