China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!

China Accident: చైనాలో మరో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Written by - Alla Swamy | Last Updated : Sep 18, 2022, 03:29 PM IST
  • చైనాలో మరో ఘోర రోడ్డుప్రమాదం
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!

China Accident: చైనాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని హైవేపై బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తీసుకెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో ఇదే పెద్దదని స్థానిక అధికారులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదాస్థలి ఎత్తైన పర్వతాల మధ్య ఉందని అధికారులు వెల్లడించారు. 

Also read:Sharad Pawar: ఉత్తర భారతం వల్లే మహిళా రిజర్వేషన్ రావడం లేదు..శరద్ పవార్ హాట్ కామెంట్స్..!

Also read:SBI: ఇకపై ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు ఉండవు..ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News