China: వివాదాలపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు.. నమ్మవచ్చా?

గాల్వన్ లోయ (Galwan Valley)లో జూన్ నెలలో చైనా సైనికుల దురాగతానికి 14 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. తమకే పాపం తెలియదని చెప్పిన చైనా తాజాగా కుయుక్తులు పన్నుతోంది.

Last Updated : Sep 1, 2020, 05:00 PM IST
  • గాల్వన్ లోయపై వ్యాఖ్యలు తగ్గించిన చైనా
  • ఇతర దేశాలల్లో ఒక ఇంచు కూడా ఆక్రమించుకోలేదు
  • తాము గొడవలకు వెళ్లే రకం కాదని చైనా నీతి వాక్యాలు
China: వివాదాలపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు.. నమ్మవచ్చా?

తూర్పు లఢాఖ్‌లోని గాల్వన్ లోయ (Galwan Valley)లో జూన్ నెలలో చైనా సైనికుల దురాగతానికి 14 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆపై గాల్వన్ లోయపై వ్యాఖ్యలు తగ్గించి తమకే పాపం తెలియదని చెప్పిన చైనా తాజాగా కుయుక్తులు పన్నుతోంది. చైనాకు ఎవరితోనూ వివాదాలు లేదని, తాము గొడవలకు వెళ్లే రకం కాదని నీతి వాక్యాలు వల్లిస్తోంది. Maoist Ganapathi Surrender: మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటు యత్నాలు!

చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా ఛుయింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘చైనా ఎన్నడూ ఏ దేశంతోనూ వివాదానికిగానీ, యుద్ధానికిగానీ కాలు దువ్వలేదు. ఇతర దేశాల భూభాగాల్లో ఒక ఇంచు కూడా ఆక్రమించుకోలేదు. మా జవాన్లు సరిహద్దురేఖను దాటరు. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తి ఉండవచ్చు.. Good News: మారటోరియం గడువు మరో రెండేళ్లు పొడిగింపు..! 
Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

రెండు దేశాల అధికారులు (చైనా, భారత్) నిజాలు ఏంటన్నది తెలుసుకుని వాటికి కట్టుబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయి. శాంతిని నెలకొల్పేందుకు, ప్రశాంత వాతావరణంలో రెండు దేశాల మధ్య సయోధ్య జరగాలి. ఇందులో దాచిపెట్టాల్సిన విషయాలు ఏవీ లేవంటూ’ చైనా ప్రతినిధి హువా ఛుయింగ్ మీడియాతో వ్యాఖ్యానించారు. Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్

Trending News