AP New Districts: కొత్త జిల్లాలు, మూడు రాజధానులపై ఇవాళ మోదీతో ఏపీ సీఎం భేటీ

AP New Districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీని కలవనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 5, 2022, 08:26 AM IST
AP New Districts: కొత్త జిల్లాలు, మూడు రాజధానులపై ఇవాళ మోదీతో ఏపీ సీఎం భేటీ

AP New Districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీని కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. 

ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మోదీకు వివరించనున్నారు. కొత్త జిల్లాల కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన సహాయంపై ప్రధాని మోదీతో చర్చిస్తారు. పోలవరం సహా పలు పెండింగ్ అంశాల్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు జగన్. రాష్ట్రానికి రావల్సిన నిధుల విడుదల గురించి మాట్లాడనున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించవచ్చని తెలుస్తోంది. విభజన హామీల గురించి మాట్లాడనున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు సహకారం కోరనున్నారు. 

Also read: Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News