Woman Producer Cheating: కెమెరా అసిస్టెంట్‌తో మహిళా నిర్మాత ప్రేమయాణం.. పెళ్లి పేరుతో భారీగా డబ్బులు వసూలు..!

Cheating Case on Woman Producer: ఓ మహిళా నిర్మాతపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని.. డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 8, 2024, 04:04 PM IST
Woman Producer Cheating: కెమెరా అసిస్టెంట్‌తో మహిళా నిర్మాత ప్రేమయాణం.. పెళ్లి పేరుతో భారీగా డబ్బులు వసూలు..!

Cheating Case on Woman Producer: కెమెరా అసిస్టెంట్‌తో ప్రేమయాణం నడిపించిన ఓ మహిళా నిర్మాత.. పెళ్లి పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఇలా.. హైదరాబాద్‌ నగరంలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్న నాగార్జున బాబు.. సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. భైరవపురం మూవీ షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర నిర్మాతగా వ్యవహరించిన  గుడివాడ ఆశా మల్లికతో అతనికి పరిచయం ఏర్పడింది. 

Also Read: Yatra 2: యాత్ర 2 సినిమా థియేటర్లు హౌస్‌ఫుల్ చేయాలంటూ ప్రభుత్వ ఆదేశాలు, నిజమెంత

ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నాగార్జునను ఆశా మల్లిక రాత్రి డిన్నర్‌కు ఆహ్వానించింది. నైట్ డిన్నర్ తరువాత ఇద్దరు శారీరకంగా కలుసుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఆశా మల్లిక తాను గర్భం దాల్చానని చెప్పింది. తనకు ఇప్పటికే పెళ్లి అయిందని.. తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని నమ్మించింది. తనను పెళ్లి చేసుకోవాలని నాగార్జునను కోరగా అంగీకరించాడు. ఇద్దరు వెళ్లి చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్ల తరువాత తనకు డబ్బులు అర్జెంట్‌గా అవసరం ఉందని ఆశా మల్లిక కోరడంతో.. తన వద్ద ఉన్న రూ.18.5 లక్షల నగదును నాగార్జున ఇచ్చాడు. మరో రూ.10 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు తీసుకున్న తరువాత ఆమె ప్రవర్తన తీరు మారింది. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఆమె గురించి నాగార్జున వాకబు చేయగా.. అప్పటికే రెండు పెళ్లిళ్లు కావడంతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కూడా తేలింది. ఈ విషయంపై నిలదీయడంతో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో గృహహింస కేసు నమోదు పెట్టింది. 

గతంలో కూడా ఆమె చేతిలో మోసపోయిన బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా ముగ్గులోకి దింపి.. పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టినట్లు తెలిసింది. తాను పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని నాగార్జునను బెదిరించింది. దీంతో నాగార్జున జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఆశా మల్లికకు సంబంధించిన మోసాల చిట్టాను సమర్పించాడు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News