Woman Brutally Kills Husband: 55 ఏళ్లకు ఎఫైర్.. భర్తను అతి కిరాతకంగా మంచానికి కట్టేసి..

Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?

Last Updated : Jul 28, 2023, 10:57 PM IST
Woman Brutally Kills Husband: 55 ఏళ్లకు ఎఫైర్.. భర్తను అతి కిరాతకంగా మంచానికి కట్టేసి..

Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా గర్జౌలా ఏరియాలోని శివనగ్‌లో నివాసం ఉండే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసుల ఎదుట నేరం అంగీకరించిన మహిళ.. తన భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపినట్టు వెల్లడించింది. మృతుడిని రామ్ పాల్‌గా గుర్తించారు. అతడి వయస్సు కూడా 55 ఏళ్లే. 

అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను ఎందుకు చంపింది ?
తొలుత తన తండ్రి కనిపించడం లేదంటూ రామ్ పాల్ కొడుకు సోమ్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి కొంత దూరంలోనే నివాసం ఉంటున్న సోన్ పాల్ తన తండ్రి రామ్ పాల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. రామ్ పాల్ భార్య, ఈ మర్డర్ కేసులో నిందితురాలు అయిన దులారో దేవి కొన్ని రోజుల పాటు తన భర్త స్నేహితుడి వద్దకు వెళ్లి అతడితోనే ఉండిపోయింది. 

ఆమె ఇంటికి తిరిగొచ్చిన వెంటనే రామ్ పాల్ కనిపించడం లేదంటూ కొడుకు సోన్ పాల్‌కి చెప్పింది. తల్లి చెప్పిన వెంటనే పోలీసు స్టేషన్‌కి వెళ్లిన సోమ్ పాల్.. తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోన్ పాల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించేందుకు గ్రామానికి వచ్చారు. అక్కడే దులారో దేవి వ్యవహారం తెలుసుకున్న పోలీసులకు ఆమెపైనే అనుమానం బలపడింది. దీంతో ముందుగా ఆమెనే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పటి వరకు తన బండారం బయటపడదనుకున్న దులారో దేవి.. పోలీసులు తననే నేరుగా ప్రశ్నించడంతో భయంతో వెంటనే తన నేరాన్ని అంగీకరించింది. 

రామ్ పాల్ నిద్రలో ఉన్నప్పుడే అతడిని మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. అతడు తనని వదిలేయమని అరిచినప్పటికీ వినిపించుకోలేదని దులారో దేవి తన అఘాయిత్యాన్నే తనే పోలీసుల ముందుంచింది. అదే గొడ్డలితో అతడి శవాన్ని ఐదు ముక్కలు చేసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. మృతుడు హత్యకు గురైన మంచంలోనే రక్తపు మరకలు ఉన్న అతడి దుస్తులు కూడా లభించాయి. గజ ఈతగాళ్లను ఉపయోగించి కాలువలో పడేసిన శరీర భాగాలను వెతికే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. అంతేకాకుండా రామ్ పాల్ హత్యలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమైనా పాల్పంచుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Trending News