బీజేపీ అభ్యర్థిపై .. స్వతంత్ర అభ్యర్థి గెలుపు

గుజరాత్‌కు చెందిన యువ న్యాయవాది మరియు సామాజికవేత్త జిగ్నేష్ మెవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్ కుమార్ పై 21000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

Last Updated : Dec 18, 2017, 12:58 PM IST
బీజేపీ అభ్యర్థిపై .. స్వతంత్ర అభ్యర్థి గెలుపు

గుజరాత్‌కు చెందిన యువ న్యాయవాది మరియు సామాజికవేత్త జిగ్నేష్ మెవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్ కుమార్ పై 21000 ఓట్ల తేడాతో గెలుపొందారు. అహ్మదాబాద్‌లో జన్మించిన జిగ్నేష్ దళిత హక్కులపై గతకొంత కాలంగా పోరాడుతున్నారు.

అభియాన్ అనే గుజరాతీ పత్రికలో ఒకప్పుడు పాత్రికేయుడిగా పనిచేసిన జిగ్నేష్ తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత తానే స్వయంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిగ్నేష్ వడ్గమ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. 

Trending News