Andhra Pradesh Govt Focus : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండడంతో ప్రభుత్వం ఆ అంశం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
AP govt appoints TTD board members: అమరావతి: ఏపీ ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలకమండలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఏపీ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఎప్పటిలాగే ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పలువురికి అవకాశం లభించింది.
అక్టోబర్ 5న విద్యా సంస్థలు తెరవాలన్ననిర్ణయాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 5 నుంచే విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( AP schools reopening ) తొలుత భావించినప్పటికీ.. కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనందున ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh ) ప్రకటించారు.
TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది.
Coronavirus in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ సర్కార్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల ( Health bulletin) చేసింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,911 బ్లడ్ శాంపిల్స్పై కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests) జరపగా.. అందులో 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 253 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
తెలంగాణ సర్కారుకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( GRMB ), క్రిష్ణా రివర్ బోర్డులు ( KRMB ) షాక్ ఇచ్చాయి. గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని.. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతోపాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనిదే కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ సర్కార్కి ( Telangana govt ) ఓ లేఖ రాసింది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.
ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 3,775 శాంపిల్స్ని పరీక్షలు చేయగా.. అందులో 75 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా మార్చి 11 వరకు నామినేషన్స్ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేడు మార్చి 12న నామినేషన్స్ పరిశీలన జరగనుండగా.. మార్చి 14వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. ఈ నేపథ్యంలో 13 జిల్లాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల వివరాలను తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.