Zee Telugu News Health Conclave Cum Awards: సమాజహితం కోరే ప్రజా వైద్యులకు జీ తెలుగు న్యూస్ అవార్డులు

Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2022, 01:14 PM IST
  • వైద్యరంగానికి పెనుసవాల్ విసిరిన కరోనా వైరస్
  • కష్టకాలంలో రక్త సంబంధాలు దూరమైనా.. అక్కున చేర్చుకున్న వైద్యులు
  • ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్న వ్యాధుల నుండి మానవ ప్రపంచానికి రక్షణ కవచంగా నిలుస్తున్న వైద్యులు
  • సమాజహితం కోరే ప్రజా వైద్యులను అభినందిస్తూ జీ తెలుగు న్యూస్ అవార్డ్స్ ప్రదానం
  • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు
Zee Telugu News Health Conclave Cum Awards: సమాజహితం కోరే ప్రజా వైద్యులకు జీ తెలుగు న్యూస్ అవార్డులు

Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. డాక్టర్లను దేవుళ్లని ఎందుకు కొనియాడతారో నిరూపించింది. కొవిడ్ విలయతాండవంలో చిక్కి లక్షలాది మంది ఉక్కిరిబిక్కిరవుతుంటే.. తామున్నామని భరోసా కల్పించారు డాక్టర్లు. జనజీవనం అతలాకుతలమైన సమయంలో.. ముందు నిలబడి... కాపు కాసి... అపర బ్రహ్మలయ్యారు. వైరస్ విలయానికి తాము బలైపోతున్నా సైనికుల్లా వైరస్‌కు అడ్డుగానిలిచారు.

కరోనా కష్టకాలం వైద్యరంగానికి పెనుసవాల్ విసిరింది. ప్రపంచాన్ని అచేతన స్థితిలోకి నెట్టింది. సొంతవాళ్లు, రక్తసంబంధీకులు కూడా పరాయివాళ్లైపోయారు. కనీసం చనిపోతే దగ్గరగా వెళ్లి చూడలేని దారుణ పరిస్థితుల్లో జనం ఒకరకమైన భయంకరమైన మానసిక స్థితిలో కూరుకుపోయారు. గతంలో ఎప్పుడూ చూడని... కనీవినీ ఎరుగని.. భయంకరమైన పరిస్థితుల్లో వైద్యుడు చీకట్లో చిరుదివ్వెలా భవిష్యత్తుపై ఆశ కల్పించాడు. తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. యుద్ధ రంగంలో దూకిన సైనికుడిలా రోగుల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించాడు. రోజూ వందలాది మంది తమ కళ్ల ముందే చనిపోతున్నా.. తోటి వైద్యులు వైరస్ సోకి ప్రాణాలు విడుస్తున్నా అదరలేదు.. బెదరలేదు. తమ వృత్తిధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. తమపై ఎంతో నమ్మకంతో వచ్చిన రోగుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించి నిస్వార్థంగా సేవ చేశారు డాక్టర్లు. చికిత్స లేని.. వ్యాధితో వచ్చిన బాధితులను కంటికి రెప్పలా కాపాడారు. వారికి మానసికంగా ధైర్యాన్నిచ్చి కోలుకునేలా చేశారు.

కరోనాపై జరిగిన యుద్ధంలో డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాత్ర కూడా వెలకట్టలేనిది. అలోపతితో పాటు హోమియోపతి, యునానీ ఇలా అన్ని రకాల వైద్యులు తమకు సాధ్యమైనంతమేర రోగులకు చికిత్సచేసి వారు కోలుకునేలా చేశారు. నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు వైరస్ నియంత్రణ కోసం కృషిచేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పోలీసులు సైతం వైరస్ నియంత్రణ కోసం కష్టపడ్డారు. ఇలా వీరందరూ గనక అడ్డుపడకపోతే.. కరోనా ఇంకెంత మంది ప్రాణాలు తీసేదో ? ఇంకెన్ని కుటుంబాలను అనాథలను చేసేదో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News