Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.
Revanth Reddy Shock: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభావం ఎదురయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు దక్కవని సునీల్ బృందం నివేదించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతుందని ఆ కమిటీ వెల్లడించింది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం మార్చేందుకు సిద్ధమయ్యారు.
Akbaruddin Owaisi: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొందరు ఓవైసీ బ్రదర్స్ ను చంపడానికి ప్లాన్ లు చేస్తున్నారని ఆయన అన్నారు. జైలులో పెట్టి స్లోపాయిజన్ పేరుతో హత్య చేస్తారని అనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
KCR House Kshudra Pooja: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Sri Rama Navami 2024: భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవాలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ముఖ్యమంత్రి చేయకూడదని తేల్చి చెప్పింది. ఇక ఉత్సవాలు ప్రత్యక్ష చేయరాదని ఆదేశించింది. దీంతో భక్తులతోపాటు ప్రభుత్వ యంత్రాగానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఉత్సవాలకు రాలేకపోవచ్చు.
Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: తెలంగాణలో ఉన్న లోక్సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్లోక్పాల్ సర్వే చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Revanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్ లోక్సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
Revanth Reddy Class: లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అజెండా లేకుండా ఎన్నికల్లో అందరి సమన్వయంతో పని చేయాలని పార్టీ దూతలు సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలిపై మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని నిలువరించి.. అందరినీ కలుపుకోవాలని సూచించారు.
Congress Akarsh: తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కూడా రాజీనామా చేశాడు. ఎన్నికల ముందు గులాబీ పార్టీలో చేరిన ఏపూరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్కు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు సోమన్న కృతజ్ఞతలు తెలిపారు.
Thatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.