Two Bangladesh Women’s Cricketers Test Positive For Omicron : బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన వారిద్దరూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జహీద్ మలాకీ ప్రకటన చేశారు.
Centre monitoring 27 districts with spike in Covid positivity rate : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
WHO warns Asia-Pacific on Omicron : డబ్ల్యూహెచ్వో తాజాగా పలు సూచనలు చేసింది. ఒమిక్రాన్.. కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఆసియా, పసిఫిక్ దేశాలు ఆరోగ్య వ్యవస్థల బలాన్ని పెంపొందించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అలాగే ఆయా దేశాలు ప్రజలకు వ్యాక్సినేషన్ను ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
ZyCoV-D Covid vaccine in 7 states : చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగానే జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్ - డీ వ్యాక్సిన్ను మొదట 7 రాష్ట్రాల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
WHO’s Dr Soumya Swaminathan Warns Against Omicron : ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని చెప్పారు. మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని ఆమె చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఈ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూఎస్ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ (Covid) బారిన పడే గర్భిణీలపై ఈ ప్రభావం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
Covid updates UK becomes first country to approve Mercks anti Covid pill molnupiravir :కరోనా మహమ్మారిపై పోరాటానికి మెర్క్,(Merck) రిడ్జ్బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్ను బ్రిటన్ ఆమోదించింది. ఈ తరహా చికిత్సకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.
WHO approves Bharat Biotechs Covaxin : కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా కోసం తుది “రిస్క్-బెనిఫిట్ అసెస్మెంట్” నిర్వహించింది డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం. టీకా తయారీదారు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది. ఈ గుర్తింపు వల్ల ఈ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది.
One person in 50 had Covid in England last week :అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించింది.
100 crore vaccine : దేశంలో వ్యాక్సినేషన్పై దురైన ఎన్నో ప్రశ్నలకు 100 కోట్ల వ్యాక్సినేషన్ ఘనతే సమాధానమని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా మనకు అతిపెద్ద సవాల్ విసిరిందని.. ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే అని ప్రధాని అన్నారు.
100 crore COVID-19 vaccination milestone : దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్.. డోసుల సంఖ్య అక్టోబరు 21..గురువారం నాటికి అంటే ఇవ్వాల్టికి 100 కోట్లు దాటనుంది. భారత్ సాధించిన ఈ ఘనతను అంతటా చాటి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది.
Sabarimala Ayyappa temple reopen : తులామాసం పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నారు.
తెలంగాణలో మరో మంత్రి గంగుల కమలాకర్ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన ఆయన.. తనను కలిసిన వారందరిని టెస్ట్ లు చేయించుకోమని సూచించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్లో మనదేశం రికార్డు సృష్టించింది. చాలా మంది కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నారు భారత్లో. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఈ సంఖ్య ప్రపంచంలోనే మన దేశంలోనే అత్యధికంగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని వివరాలు వెల్లడించింది. భారత్లో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5శాతం, మహిళలకు 47.5శాతం, ఇతరులకు 0.02శాతం డోసుల వ్యాక్సిన్ (vaccine) వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ బాగా జరిగింది. 62.54శాతం వ్యాక్సినేషన్ జరిగింది.
కరోనా సంక్షోభంలో అందరికీ సగం జీతం వస్తే, ఈ కంపెనీ మాత్రం బోనస్ ఇస్తుంది, అది కూడా ఫిట్ గా ఉంటే చాలు ఒక నెల జీతం బోనస్ తో పాటు రూ.10 లక్షలు లక్కీ డ్రా ఇస్తామని స్టార్టప్ కంపెనీ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ ప్రకటించింది.
Online Classes: ఆ ఊర్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేక శ్మశానికి వెళ్లి చదువుకుంటోంది ఓ మెడికల్ స్టూడెంట్. ఇప్పడు ఆ విద్యార్థిని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.