'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మరిన్ని ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ రోజు(ఆదివారం) జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
''కరోనా వైరస్'' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనా, ఇటలీల్లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్యలో చైనాను దాటిపోయింది ఇటలీ. మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
అసలే ''కరోనా వైరస్'' మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పేరు వింటేనే జనం నిలువునా గజాగజా వణికిపోతున్నారు. భారత దేశంలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
కరోనా వైరస్ ఎఫెక్ట్ మందుబాబులపైనా పడింది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, థియేటర్లు, స్కూళ్లు, పార్కులు, పెద్ద పెద్ద హోటళ్లు.. ఇలా అన్ని మూతపడ్డాయి. ఐతే ఇప్పుడు ఈ ప్రభావం మందు బాబులపైనా పడింది. చాలా వరకు వైన్ షాపుల ముందు జనం లేకుండా పోయారు.
'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న మృత్యు కెరటం. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వ్యాధి ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయంటే దీని ప్రభావం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.
'కరోనా వైరస్'పై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయారు. కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజ గజా వణికిస్తోంది. ఇప్పటికే 163 దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు నివారణ చర్యలపై దృష్టి పెట్టాయి.
బాహుబలి, సాహో చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో ప్రభాస్ పై... ఇప్పుడు 'కరోనా వైరస్' ఎఫెక్ట్ పడింది. 'కరోనా వైరస్' ప్రభావం కారణంగా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితమే 'కరోనా' ఎఫెక్ట్ తన మీద పడవద్దని.. ప్రభాస్ మాస్క్ తో కనిపించాడు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. షేక్ హ్యాండ్ లు ఇవ్వడాన్ని జనం పూర్తిగా నిషేధించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. అంతే కాదు ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు
ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది 'కరోనా వైరస్'. కానీ కొంత మంది ఔత్సాహికులు కరోనా వైరస్ అంశాన్ని కూడా పాటల కోసం మలచుకుంటున్నారు. ఇప్పుడు వారు పాడిన పాటలు వైరల్ గా మారుతున్నాయి.
మనిషికి కష్టం వస్తే. . దేవుడా కాపాడు.. అని మొర పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'కరోనా వైరస్' ప్రభావం ఇప్పుడు సాక్షాత్తూ భగవంతునిపైనా పడింది.
'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే 'కరోనా వైరస్' బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 7 వేల 138 మందికి చేరుకుంది. దాదాపు లక్షా 67 వేల 511 మంది పాజిటివ్ లక్షణాలతో సతమతమవుతున్నారు.
టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. వైరస్ ఎఫెక్ట్ కారణంగా 140 దేశాలు స్వచ్ఛత, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యక్తిగత పరిశుభ్రత పెరిగింది. ఎక్కడ చూసినా.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. వైరస్ దాడి బారి నుంచి తప్పించుకోండి అనే ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 144 దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయంతో గజగజా వణికిపోతున్నారు. చైనా సహా ఇటలీ లాంటి దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది.
ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్'... భారత దేశంలోనూ విజృంభిస్తోంది. అందులోనూ తెలంగాణలోనే ఇప్పటి వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వ్యక్తికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3కు పెరిగింది.
'కరోనా వైరస్'.. ఇది ప్రస్తుతం అతి వేగంగా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న మహమ్మారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO కూడా దీన్ని 'మహమ్మారి'గా ప్రకటించింది. ఇప్పటి వరకు 114 దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ప్రముఖులైనా, సినీ ప్రముఖులైనా ఎవరికీ తప్పని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కరోనా వైరస్ అంటే గజగజలాడిపోతున్నారు.
'కరోనా వైరస్' ప్రభావం కారణంగా. . ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేసిన పరిస్థితి దాపురించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.