దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువలో ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చివరి 24 గంటల్లో కొత్తగా మరో 1,813 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కి చేరింది.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుండటం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కొంత ఊరటను కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం.
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సిబ్బందిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందనే వార్త నుంచి వైద్య ప్రపంచం ఇంకా తేరుకోకముందే తాజాగా ఢిల్లీలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో మంగళవారం 77 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.
తెలంగాణలో రోజూ వారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండటం అటు తెలంగాణ సర్కార్కి ఇటు కరోనాతో ఆందోళనకు గురవుతున్న ప్రజానికానికి కొంత ఊరట కలిగిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 7కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 2కి పడిపోవడం గమనార్హం.
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఆస్పత్రులలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిలో కొన్ని చోట్ల, కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని క్వారంటైన్కి తరలించిన సంగతి తెలిసిందే.
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, ఏపీలో మాత్రం పెరిగిపోతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమవడం విశేషం.
భారత్లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
చిలకలగూడలో నారాయణ అనే ఓ 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఇరుగుపొరుగు వారు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
కరోనా వైరస్ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.