అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. (Father Kills Son)
మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. (Resuming flight services in India)
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి.
కరోనావైరస్ మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంత ప్రాణ నష్టాన్ని చవిచూస్తుందో తెలిసిందే. అమెరికా లాగే ఎంతో అభివృద్ధి చెందిన రష్యాలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిత్యం కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం రష్యాను కలవరానికి గురిచేస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు (Andhra radesh CoronaVirus Deaths) నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది.
ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనావైరస్ రోగులు, మరో ఇద్దరు అనుమానితులు కలిపి మొత్తం 8 మంది పరారైన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్లోని ఓ హోటల్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా... వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోడ దూకి పారిపోయారు.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో గత 24 గంటల్లో 826 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరినట్టయింది. మరోవైపు గత 24 గంటల్లో 28 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేయడంతో రాజకీయ నాయకులు మీడియా సిబ్బందిని ఆహ్వానించకుండానే ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడానికి, వాణిజ్య సంస్థలు తమ సిబ్బందితో వెబినార్స్ (Webinars), ఆన్లైన్ మీటింగ్స్ (Online meetings) నిర్వహించుకోవడం, విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడం (Online classes), అధికారులు మిగతా సిబ్బందితో సమావేశం అవడం తదితర పనులకు జూమ్ యాప్ను (Zoom App) విరివిగా వినియోగిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో తెలంగాణ నుంచి 8 జిల్లాలను (Telangana hotspots Red Zones) ఆ జాబితాలో పొందుపరిచారు.
ఏపీలో బుధవారం కొత్తగా మరో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కరోనావైరస్ పాజిటివ్తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో చోటుచేసుకుంది. షిల్లాంగ్లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్స్పాట్స్గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా AP Coronavirus Positive Cases మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖెరావాలాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అహ్మెదాబాద్లోని జమాల్ పూర్-ఖేరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇమ్రాన్కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.