కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.
కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి.
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Positive cases) రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరుకోగా అందులో ప్రస్తుతం 3,666 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో శనివారం నాడు కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఈ గణాంకాల ప్రకారం తాజాగా తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 272కి చేరుకుంది.
కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు.
కరోనా వైరస్ (COVID-19) పేరు వింటేనే ఇప్పుడు యావత్ దేశం నిలువునా వణికిపోతోంది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న తీరు.. వ్యాధితో వస్తున్న లక్షణాలు (Coronavirus symptoms), సంభవిస్తున్న మరణాల సంఖ్యను (Fatalities) చూసే జనం హడలెత్తిపోతున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా... ఆ కోపంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్విన ఘటన కర్ణాటక హుబ్లిలోని మంతూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణలో శుక్రవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మరోవైపు కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏరోజుకు ఆరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
భారత్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 478 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ సోకడం మొదలైన తర్వాత 24 గంటల్లో ఇంత అత్యధికంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఏపీలో తాజాగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ ఓ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
కరోనావైరస్ రోగులకు ఆహారం, మెడిసిన్ అందించే సమయంలో మనుషులు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది కనుక ఆ పనిని చేసేందుకు రోబోలను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.