ఏపీలో గత 24 గంటల్లో 6306 బ్లడ్ శాంపిల్స్కి కోవిడ్ పరీక్షలు జరపగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.
చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtr CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus spread) నివారణకు లాక్ డౌన్ (Lockdown) చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు (Indian Railways services) కూడా ఒకటి.
భారత్లో కరోనా వైరస్ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
కరోనావైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,329 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారు. అదే సమయంలో మరో 44 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 3,775 శాంపిల్స్ని పరీక్షలు చేయగా.. అందులో 75 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.
కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో కరోనా లేటెస్ట్ అప్డేట్స్ని మీడియాకు వెల్లడించారు
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
తెలంగాణలో సోమవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు చనిపోగా కొత్తగా 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం గుర్తించిన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి చేరింది.
తెలంగాణలో లాక్డౌన్ (Lockdown in Telangana) మే 7వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.