TRS MLA JUMP: బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే? కేంద్రమంత్రి డీల్.. త్వరలోనే ముహుర్తం

TRS MLA JUMP: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. దూకుడు మీదున్న బీజేపీలోకి జోరుగా నేతలు జంప్ చేస్తున్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 28, 2022, 10:37 AM IST
  • బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే!
  • కేంద్రమంత్రితో ముగిసిన డీల్
  • చీకోటి కేసులో ఎమ్మెల్యే లింకు?
TRS MLA JUMP: బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే? కేంద్రమంత్రి డీల్.. త్వరలోనే ముహుర్తం

TRS MLA JUMP: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. దూకుడు మీదున్న బీజేపీలోకి జోరుగా నేతలు జంప్ చేస్తున్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు సహా పలువురు కీలక నేతలు కమలం గూటికి చేరారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని, సంచలనాలు జరగబోతున్నాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కేంద్రమంత్రి డీల్ జరిగిపోయిందని.. త్వరలోనే ఆ ఎమ్మెల్యే కారు దిగి కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ సాగుతోంది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చోకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకులున్నాయనే ప్రచారం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సదరు ఎమ్మెల్యేలకు ఈడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయనే వార్తలు వచ్చాయి. మనీ లాండరింగ్‌లో ఆ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగింది. చీకోటి కేసులో లింకులున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే బీజేపీలో నేతలతో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. తనను ఈడీ కేసు నుంచి తప్పిస్తే బీజేపీలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేశారని తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేతో కేంద్రమంత్రి చర్చలు జరిపారని.. డీల్ కుదిరిందని.. త్వరలోనే సమయం చూసుకుని సదరు ఎమ్మెల్యే బీజేపీలో చేరడం ఖాయమని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరితే ఆ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలోనూ బీజేపీ పెద్దల నుంచి హామీ వచ్చిందని చెబుతున్నారు,

క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారని.. ప్రభుత్వ పెద్దల సాయంతో బయటపడారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేకు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయని.. దేశంలోని పలువురు ప్రముఖులతో బిజినెస్ డీల్స్ ఉన్నాయని అంటున్నారు. సదరు ఎమ్మెల్యే కుమారుడికి చీకోటి ప్రవీణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వ్యాపారాల్లోనూ లింకులు ఉన్నాయని తెలుస్తోంది.క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ తో ఎమ్మెల్యే న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలోనూ ఈడీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఈడీ కేసులో చిక్కుకోవడంతో తనకు సమీప బంధువైన బీజేపీ సీనియర్ నేతను ఎమ్మెల్యే ఆశ్రయించారని.. కేంద్రమంత్రిగా ఉన్న బీజేపీ నేత అతనికి అండగా నిలిచారని అంటున్నారు. అందుకే సదరు ఎమ్మెల్యే విషయంలో ఈడీ సైలెంట్ అయిందనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరుతానని హామీ ఇవ్వడంతో కేంద్రమంత్రి అతనిని ఈడీ కేసు నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News