కరోనా ప్రభావంతో ఒక్కసారిగా గోవు మూత్రానికి డిమాండ్ ఎక్కువైపోయింది. గో మూత్రం సేవిస్తే, ఆవు పేడ శరీరానికి పూసుకుంటే కరోనా వైరస్ సోకదని మూఢనమ్మకాలు సృష్టించడంతో గో మూత్రం, ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాకు 20
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ చేసిన సరికొత్త శైలిలో దూసుకుపోతోంది. రానున్న ఎన్నికలకు పెద్ద ఎత్తున "బంగ్లర్ గోర్బో మమతా" పేరుతో ప్రజల్లోకి వెళుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. "దీదికే బోలో" (దీదీకి చెప్పండి) అనే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీ. ఈ విషయం ఎవరినీ అడిగినా ఠక్కున చెప్పేస్తారు. ఐతే అలాంటి పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా .. ఆమె పేరు కచ్చితంగా అందులో ఉండే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉండి తీరాల్సిందే.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్తలు, నాయకులు గూండాగిరీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ ఉపాధ్యాయురాలిపై కీచక పర్వానికి తెరతీసిన ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్ పూర్ జిల్లాలోని గంగ్రామ్ పూర్ లో జరిగింది.
పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు. రోజు రోజుకు ఇంకా రగులుతూనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ "పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్" గా
బుల్బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
సీసీఐ వర్సెస్ స్టేట్ గవర్నర్ మెంట్ పరిణామాలతో కోల్ కతాలో హైడ్రామా నెలకొంది. చిట్ ఫంట్ స్కాం పేరుతో కోల్ కతా సీపీ రాజీవ్ను విచారించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులను మమత సర్కార్ అడ్డుతగిలింది. అనుమతి లేకుండా వచ్చినందుకు సీబీఐ బృందాన్ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం..అనంతరం సీఎం మమత తన మంత్రి వర్గ అనుచరులతో రాత్రంతా సీపీ ఇంటి వద్ద జాగరం చేమడం.. మెట్రో స్టేషన్ వద్ద దీక్షకు దిగడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో ఉద్రిక్త వావరణం నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.