Winter Olympics 2022: బీజింగ్​లో అట్టహాసంగా శీతాకాల ఒలింపిక్స్​ ప్రారంభోత్సవం!

కరోనా సంక్షోభం మధ్యే శుక్రవారం 'బీజింగ్​ వింటర్ ఒలింపిక్స్​ను ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ ఒలింపిక్స్​ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 24వ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 11:01 PM IST
  • బీజింగ్​ వింటర్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభం
  • ఆకట్టుకున్న ప్రారంభ వేడుకలు
  • కొవిడ్ నిబంధనల నడుమే దేశాల పరేడ్
Winter Olympics 2022: బీజింగ్​లో అట్టహాసంగా శీతాకాల ఒలింపిక్స్​ ప్రారంభోత్సవం!

Winter Olympics 2022: కరోనా సంక్షోభం మధ్యే శుక్రవారం 'బీజింగ్​ వింటర్ ఒలింపిక్స్​ను ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ ఒలింపిక్స్​ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 24వ శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన చేశారు.

బీజింగ్​లోని 'బర్డ్స్ నెస్ట్'​ స్టేడియంలో బాణసంచా వెలుగులతో లాంఛనంగా ఈ  ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. అయితే స్టేడియంలో ప్రేక్షకులు చాలా తక్కువగా కలిపించడం గమనార్హం. కొవిడ్ నేపథ్యంలో టికెట్లు విక్రయించకపోవడం వల్ల ప్రేక్షకులను అనుమతించలేదు. ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు వచ్చిన వారి, వివిధ దేశాల రిప్రజెంటేటివ్స్​ మాత్రమే స్టేడియంలో కనిపించారు. ఈ స్టేడియం కెపాసిటి 90 వేల మంది కావడం విశేషం.

బీజింగ్​ రికార్డు..

ఇక 2008లో సమ్మర్​ ఒలింపిక్స్, ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్​ ప్రారంభించిన నగరంగా బీజింగ్​ చరిత్ర సృష్టించింది.
కొవిడ్ 19 భయాలు, మానవహక్కుల సంఘం విమర్శల నేపథ్యంలోనే ఒలింపిక్స్ ప్రారంభమమవడం గమనార్హం.

అట్టహాసంగా ఆరంభ వేడుకలు..

ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మఖ్యంగా చైనీస్​ క్యాలెండర్ ప్రకారం.. వసంతకాలం వచ్చిందనేందుకు సంకేతంగా డ్యాన్సర్లు ఆకుపట్ట జెండాలను ఊపుతూ.. ప్రదర్శన చేశారు.

ఆ తర్వాత వివిధ దేశాల కవాతు జరిగింది. ఒలింపిక్స్ సాంప్రదాయం ప్రకారం.. మొదటగా గ్రీస్​ పరేడ్ స్టేడియంలోకి వెళ్లింది.

ఆ తర్వాతి కవాతులను చైనీస్​ అక్షరాలతో.. మొదటగా వచ్చే దేశం ప్రకారం నిర్వహించారు. ఇందులో టర్కీ మొదటి రెండో స్థానంలో (గ్రీస్​ తర్వాత) ఉంది.
ఇక శీతాకాల ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇస్తున్న చైనా కవాతు చివరగా వెళ్లింది.

వేడుకలకు పుతిన్ హాజరు..

ఒలింపిక్స్​ క్రీడల ప్రారంబోత్సవానికి హాజరైన అంతర్జాతీయ నాయకుడిగా  రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్​ నిలిచారు. అయితే డోపింగ్ పరీక్షలో పట్టుబడ్డ కారణంగా.. రష్యా తరఫు అథ్లెట్లు.. తమ జాతీయ జెండాకుక బదులు.. రష్యన్ ఒలింపిక్స్​ కమిటీ జెండాలతో కవాతు నిర్వహించారు. ఇక కవాతు నిర్వహించిన వారితో పాటు..స్టేడియంలో ఉన్నవారంతా మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధనలను పాటించడం గమనార్హం.

Also read: Video: బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానానికి తప్పిన ప్రమాదం.. పైలట్ చాకచక్యం..

Also read: Covid Vaccine: ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. అత్యవసర అనుమతి కోరిన ఫైజర్-బయోఎన్‌టెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News