AP Omicron Cases: ఏపీలో బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in AP) వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది.  కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ (Omicron Variant) ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు,  కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఒకేసారి ఇన్ని కేసులు రావడంతో..ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 



దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron cases in India) దాదాపు 800కు చేరువలో ఉంది. ఎక్కువ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు (Covid cases in India) వెలుగుచూశాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా  77,002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 143.15 కోట్ల వ్యాక్సిన్ డోసులు (Vaccination) వేశారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. 


Also Read: Coronavirus: దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు... 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook