DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ కింద పడ్డారు. బెంగళూరులోని విధానసౌధలో సైకిల్ పై నుంచి బ్యాలెన్స్ అవుట్ అయి కిందపడ్డారు. విధానసౌధలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మారథాన్ నిర్వహించారు. అందులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న DK శివ కుమార్ సైకిల్ తొక్కారు. అయితే ఆయనకు సైకిల్ బ్యాలెన్ చేయలేకపోయారు. దీంతో ఆయన పక్కకు ఒరిగిపోయారు. పక్కనే వున్న గన్ మెన్ సహాయంతో పైకి లేచారు.
Kaleshwaram Commission: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి.. ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదు.
Israel Iran War Video: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఇరాన్ అణు స్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నటాంజ్లోని అణుస్థావరంపై క్షిపణులతో దాడికి దిగింది. దాడిలో సెంట్రీప్యూజ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతేకాదు ఈ దాడిలో 9మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలుస్తోంది. దాడిని ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అంటు నటాంజ్ పై దాడిని ఇప్పటికే ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
Haryana Gang: కుప్పంలో హర్యానా దొంగలు హల్చల్ చేశారు. ఓ కారులో సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. దుండగులు ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. వివరాలు ఇలా..
Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషాదం తెలిసిందే. అయితే ఈ ఘటనకు అసలు కారణాలు ఏంటి..? 11 మంది మరణం వెనుక తప్పిదం ఎవరిది..? వివరాలు ఇవే..
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి మెట్టు వద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్కు మార్చారు.
Chenab Rail Bridge: ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చినాబ్ రైలు వంతెనను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రైల్వే వంతెన. కాత్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు మోదీ ప్రారంభిస్తారు.
Six Sisters Death: రీల్స్ పిచ్చితో ఆరుగురు అమ్మాయిలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఆరుగురు అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ.. నదిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన యూపీలో ఆగ్రా సమీపంలో చోటు చేసుకుంది.
China Fungus: చైనా మరో బయో వార్కు రెడీ అయింది. అమెరికాపై ఫంగస్ దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫంగస్ స్మగ్లింగ్ చేస్తుండగా.. ఇద్దరు సైంటిస్టులను ఎఫ్బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా నుంచి తేరుకునేలోపే చైనా నుంచి మరో ఫంగస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
MLC Botsa Satyanarayana: వైఎస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్యం నిలకడగా ఉంది.
India Pakistan War: ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాక్ పాలకుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఈ ఆపరేషన్ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలపై మాత్రమే దృష్టి సారించింది. భారత సైన్యం తొమ్మిది ప్రాంతాలలో దాడులు నిర్వహించి, లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్పై దుష్ప్రచారం చేస్తోంది. భారత దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్ తమ సైన్యం తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. అయితే భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయాన్ని
Mock Drill In India: భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక ఆదేశం జారీ చేసింది. వైమానిక దాడులు లేదా యుద్ధ సమయ పరిస్థితులు వంటి అత్యవసర పరిస్థితులకు పౌరులను సన్నద్ధం చేయడానికి దేశవ్యాప్తంగా 259 ప్రదేశాలలో మాక్ డ్రిల్లు నిర్వహించనున్నారు. దాదాపు 50 సంవత్సరాలలో ఇంత పెద్ద స్థాయిలో జాతీయ సంసిద్ధత డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ డ్రిల్లు జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో కూడా జరగనున్నాయి. మాక్ డ్రిల్ అంటే ఏమిటి? అనేది పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో మీరు ఏ
Operation Sindoor Viral Video: బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయి. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇదివరకే హెచ్చరించిన భారత్, పాకిస్థాన్పై తీవ్రమైన దాడులకు దిగింది. ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళల దుఃఖాన్ని తుడిచేలా 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత త్రివిధ దళాలు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడులు ప్రారంభించాయి.
Operation Sindhur Latest News: ఖతార్ పాకిస్తాన్కు విమాన సేవలను నిలిపివేసింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా భారత సైన్యం పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది.
Tollywood News: 75 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఓ యువ నటుడు హీరోగా పరిచయం కానున్నాడు. భాను దర్శకత్వంలో ఓ సరికొత్త ప్రేమకథ తెరకెక్కుతోంది. వివరాలు ఇలా..
Criminal 123 Movie: యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను పర్ఫెక్ట్ స్క్రీన్ప్లేతో తెరకెక్కిస్తే ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రాకాదన్ తెలుగులో విడుదల కానుంది. క్రిమినల్ 123 పేరుతో మే నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది.
Yamudu Movie Poster: యముడు మూవీ నుంచి మరో పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Kalanki Bhairavudu First Look Poster: హార్రర్ థ్రిల్లర్ కాళాంకి భైరవుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ పూర్తవ్వగా.. అతి త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Dear Uma Movie Pre Release Event: డియర్ ఉమ ఈ నెల 18న థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ గ్రాండ్గా నిర్వహించారు. ప్రతి ఒక్కరు థియేటర్స్లో చూసి మంచి విజయాన్ని అందించాలని చిత్రబృందం కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.