Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,785 పరీక్షలు నిర్వహించగా.. 434 కొవిడ్ కేసులు (Corona Cases in AP) వెలుగు చూశాయి.  దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,78,376కి చేరాయి. వైరస్ తో ఎవరూ మృతి చెందలేదు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,499గా ఉంది. కరోనా నుంచి 102 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 20,62,029 మంది బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇవాళ నాలుగు ఒమిక్రాన్ కేసులు ((Omicron cases in AP)  వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్ గా తేలింది.  గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను (Omicron) గుర్తించారు.


Also Read: AP Omicron cases: ఏపీలో మరో 4 ఒమిక్రాన్ కేసులు... మొత్తం కేసులెన్నంటే?


దేశంలో గత 24 గంటల్లో 58వేలకు పైగా కరోనా కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. వైరస్ తో 534 మంది ప్రాణాలు (COVID-19 Death in India) కోల్పోయారు. కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా నమోదైంది. దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు (Corona Active cases in india) ఉన్నాయి. ఇప్పటి వరకు 147.72 కోట్ల టీకా డోసుల పంపిణీ చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి