AP Fights Corona | ఏపీలో తాజాగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452కు చేరింది. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్ పరీక్షించగా 45 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలగా, కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో కరోనాతో ఒకరు మరణించారు.


నిన్న 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2452 పాజిటివ్ కేసులకుగాను 1680 మంది డిశ్చార్జ్ కాగా, 54 మంది మరణించారు. ప్రస్తుతం 718 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్