ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు పెంచినప్పటినుంచీ ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2500 దాటింది. ఏపీలో తాజాగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,514కు చేరింది. తాజాగా ఓ కరోనా మరణం సంభవించింది. రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,415 శాంపిల్స్ పరీక్షించగా 62 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్న ఒక్కరోజే 51 మంది కరోనా వైరస్ బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్19 వల్ల కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.  తొలిసారి రూ.49 వేల మార్క్ చేరిన బంగారం


రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకుగాను 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం 728 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్