Corona cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.  గడిచిన 24 గంటల్లో 24,280 పరీక్షలు నిర్వహించగా.. 984 కొవిడ్ కేసులు (Corona Cases in AP) నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,82,843కి చేరాయి. వైరస్ తో ఎవరూ మృతి చెందలేదు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. కరోనా నుంచి 152 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 20,62,732కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 5,606 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో...తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ (NIght Curfew in AP) విధించాలని నిర్ణయించింది. కరోనా థర్డ్‌వేవ్ నేపధ్యంలో.. ఏపీ ప్రభుత్వం (AP Govt) ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ అమల్లో రానుంది. అటు ధియేటర్లు, మాల్స్ కేవలం 50 శాతం ఆక్సుపెన్సీతోనే నడపాల్సి ఉంటుంది. ఇక దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది.


Also Read: AP Night Curfew: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్‌ కర్ఫ్యూ, విద్యాలయాల మూసివేతపై..


దేశంలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,79,723 మంది వైరస్ (Corona cases in India) బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 29,60,975 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,94,05,951కు చేరింది. మరోవైప దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook