గుజరాత్ లోని గాంధీనగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి తరహా భారీ ప్రాజెక్టును ఏపీలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అమరాతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.. .దీనికి గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ వ్యవస్థపాకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరాతిలో ఆయనకు సంబంధించిన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. భారీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం నమూనా స్థలం కూడా సిద్ధం చేశారు. నీరుకొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం


నీరుకొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపజేయాలని నిర్ణయించారు.  విగ్రహం చూట్టూ మొత్తం 200 ఎకరాల్లో ఎన్టీఆర్ మెమెరియల్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యటాక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా విరాళాలు సేరించి దీని నిర్మాణం చేయనున్నట్లు తెలిసింది


ఎన్టీఆర్ విగ్రహ ప్రత్యేకతలు:


* మొత్తం 200 ఎకరాల్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ మెమెరియల్ ప్రాజెక్టు
*విగ్రహ ఏర్పాటుకు 14 ఎకరాల భూమి కేటాయింపు
*నీరుకొండ చుట్టూ 70 -80 ఎకరాల్లో జలాశయ నిర్మాణం
* ఎన్టీఆర్ మెమెరియల్ ప్రాజెక్టు వ్యవయం రూ.406 కోట్లు
* ఒక్క విగ్రహ నిర్మాణానికే రూ. 155 కోట్లు కేటాయింపు
*  ప్రాజెక్టు నిర్మాణం కోం  ప్రత్యేక ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరణ


మోడీతో పోటీ పడుతున్న చంద్రబాబు
ప్రతి విషయంలో మోడీతో నువ్వా నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్లున్న చంద్రబాబు.. విగ్రహాల విషయంలో కూడా ప్రధాని మోడీతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అమరాతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతిష్టించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.