కడప: వైఎస్ వివేక హత్య కేసులో విచారణ చేపడుతున్న సిట్.. అన్నికోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసింది .ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. దీంతో పాటు  వైఎస్ వివేకా బంధువులు, సన్నిహితులను కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కుసునూరి పరమేశ్వర్ రెడ్డి  అనే పేరు తెరపైకి వచ్చింది


ప్రుమఖ మీడియా కథనం ప్రకారం పరమేశ్వర్ రెడ్డి వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు. వివేకా హత్య తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు.దీంతో పోలీసులు ఇతని జాడ కోసం ఆరా తీస్తున్నారు. క్రైం రిపోర్టు ప్రకారం పులివెందులకు చెందిన కుసునూరి పరమేశ్వర్ రెడ్డి పై  పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. దీంతో హత్యకు ఈయనకు లింక్ ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివేకాకు అంత్యత సన్నిహితుడిగా పేరున్న గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా పరమేశ్వర్ రెడ్డి పేరు ఇలా తెరపైకి వచ్చింది.