న్యూఢిల్లీ: లోక్ సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఎన్నికలకు సరిగ్గా మరో వారం రోజులే మిగిలివుండగా ప్రచారానికి అంతకన్నా ఇంకా ముందే తెరపడనున్న నేపథ్యంలో ఇవాళే తెలంగాణలో కరీంనగర్, హన్మకొండ, ఏపీలో సత్తెనపల్లి, నర్సారావుపేట, విశాఖపట్నంలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 11.45 గంటలకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరగనున్న సభకు మొదట హాజరు కానున్న అమిత్ షా ఆ తర్వాత 1.30 గంటలకు హన్మకొండలోని జేఎన్ఎం కాలేజ్ గ్రౌండ్స్‌లో సభలో పాల్గొంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177792","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక ఏపీలో అమిత్ షా పర్యటన విషయానికొస్తే, 3.30 గంటలకు సత్తెనపల్లిలోని స్టేడియంలో బీజేపి చేపట్టనున్న సభకు తొలుత హాజరైన అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్టణం వెళ్లనున్నారు. విశాఖలో ఊర్వశి జంక్షన్ నుంచి కంచర్లపాలెం మెట్టు వరకు జరగనున్న ఎన్నికల ర్యాలీలో షా పాల్గొని ప్రసంగిస్తారు.