Anandaiah Medicine:కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తన వంతు ప్రయత్నం చేసిన వ్యక్తి ఆనందయ్య. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధాన్ని ఏపీలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. పలు పరీక్షలు చేసి, నిపుణులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆనందయ్య కరోనా ఔషధానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని ప్రాంతాల్లో నేటికీ తన పేరిట నకిలీ ఔషధాలు తయారుచేసి విక్రయిస్తున్నట్లు కృష్ణపట్నం ఆనందయ్య తెలుసుకున్నారు. నకిలీ మందు తయారుచేసి కొందరు విక్రయాలు చేస్తున్నారని, తన పేరిట ఇతరులు తయారుచేసి విక్రయిస్తున్న నకిలీ మందు (Anandaiah Corona medicine) వికటిస్తే తాను మాత్రం బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు. చిట్టమూరు మండలం మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆనందయ్య మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో కరోనా మందు పంపిణీ చేశారు. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాలకు తన ఔషధం చేరడం సంతోషంగా ఉందన్నారు.


Also Read: Anandaiah Corona medicine: ఆనందయ్య చుక్కల మందులో హానికారక పదార్థం, రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు


తన ఔషధాన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడానికి తోడ్పాడు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు. అయితే కొందరు తన పేరట నేటికీ నకిలీ కరోనా మందు (Krishnapatnam Medicine) తయారుచేస్తున్నారని తెలిపారు. ఆ ఔషధాన్ని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారని, ఆ మందు వికటిస్తే అందుకు తాను బాధ్యుడిని కాదని చెప్పారు. ఇలా ఇతరుల పేరుతో నకిలీ మందులు తయారుచేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆనందయ్య కోరారు.


Also Read: AP CM YS Jaganకు లేఖ రాసిన కృష్ణపట్నం Anandaiah, సహకారం కోసం విజ్ఞప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook