వైజాగ్ ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో బుధవారం నుంచి అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరగనుంది. 'ఆంధ్రప్రదేశ్‌ అగ్రిటెక్‌ సమ్మిట్‌-2017' పేరిట మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇద్దరూ కలిసి సదస్సును ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి జరిగే ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 61 మంది ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ వర్సిటీ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరుకానున్నారు. సదస్సు చివరి రోజు కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్‌గేట్స్‌ హాజరుకానున్నారు.