అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీచేస్తోన్న చంద్రబాబు నాయుడు తన విజయంతోపాటు తన పార్టీ అభ్యర్థుల గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న మంత్రి నారా లోకేష్ సైతం పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177906","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ ఎన్నికల్లో కూడా టీడిపి భారీ మెజార్టీతో విజయం సాధించి మరోసారి అధికారం సొంతం చేసుకుంటుందని చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ ధీమా వ్యక్తంచేస్తూ వస్తున్నారు.