అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలకు ఇంచార్జ్‌ మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా నియమితులైన జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు-బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు-అనిల్‌కుమార్‌ యాదవ్‌, కడప- ఆదిమూలపు సురేష్‌, అనంతపురం-బొత్స సత్యనారాయణ, తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ, పశ్చిమగోదావరి - పేర్ని నాని, కృష్ణా -పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు, ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి,  చిత్తూరు-మేకపాటి గౌతమ్‌ రెడ్డి, శ్రీకాకుళం-కొడాలి నాని, విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశాఖపట్నం- కన్నబాబు జిల్లాల ఇంచార్జ్‌ మంత్రులుగా నియమితులయ్యారు.