AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 156 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 31,131 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా జిల్లా, నెల్లూరు, విశాఖపట్నంలో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది.



ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 188 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.


ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,07,46,537 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,74,708 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 20,58,289 మంది కరోనాను జయించగా.. 14,465 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,954 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.


మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.


దేశంలో ఇలా..


దేశవ్యాప్తంగా కూడా గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 7,992 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 33 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కేంద్రం కూడా కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.


Also read: Lance Naik Sai Teja's Body : బెంగళూరుకు చేరిన లాన్స్‌ నాయక్ సాయితేజ భౌతికకాయం


Also read: Saiteja: సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం...రూ. 50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook