AP CM Jagan: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) ఫోన్‌లో పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌(Governor Biswabhusan harichandan)తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు చెప్పారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని గవర్నర్‌కు సీఎం వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌(Covid-19 Positive)గా తేలిన విషయం తెలిసిందే. ఈ నెల 15న  వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. గవర్నర్‌ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో నిన్న ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 


Also Read: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా..ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు..


ఆయన వయస్సు 87 సంవత్సరాలు. బిశ్వభూషణ్‌(AP Governor Biswabhusan harichandan)కు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్  2019 జూలై 24న ఏపీ గవర్నర్‌(AP Governor)గా బాధ్యతలు స్వీకరించారు. 1971లో జన సంఘ్‌లో చేరిన బిశ్వభూషణ్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-09 మధ్య ఒడిశా మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ గుర్తింపు పొందారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook