వైజాగ్ : విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు. తీవ్ర అస్వస్థతకుగురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షలు, విష వాయువు ప్రభావంతో ఆస్పత్రిపాలైన సాధారణ కేసుల బాధితులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆయన తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Vizag: గ్యాస్ లీకేజీపై స్పందించిన కంపెనీ


ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ధైర్యం చెబుతూ సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..