AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,983 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బులిటెన్ ద్వారా ప్రకటించింది. అయితే గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా.. మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 11 మంది మరణించారు. కరోనా ధాటికి మరణాలు జిల్లాల వారిగా.. విశాఖపట్నంలో నలుగురు మృతి చెందగా, కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించింది. 


కరోనా వైరస్ నుంచి కొత్తగా మరో 11,280 మంది బాధితులు కోలుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ఆ ప్రత్యేక బులిటెన్ లో వెల్లడించింది. 



Also Read: CM Jagan on Probation: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు!


Also Read: Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే- కేంద్ర సహాయమంత్రి పార్లమెంట్ లో ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook