తూ.గో: పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి, వర్మలు విమర్శలు చేయడం... అలాగే పలు మీడియా సంస్థలు ఆయనపై పదే పదే విమర్శలకు దిగడం.. నెగిటివ్ కథకాలు ప్రసారం చేయడం వంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. తాజా పరిణమాల నేపథ్యంలో నేపథ్యంలో ఈ కథంతా టీడీపీయే వెనకుండి నడిపిస్తందని..చంద్రబాబు,లోకేష్ ల కుట్ర అని  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పదే పదే విమర్శలకు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఈ అంశంపై స్పందించారు.  పవన్‌ కల్యాణ్‌ను అప్రతిష్టపాల్జేయాల్సిన అవసరం సీఎం చంద్రబాబుకు కానీ.. ఆయనకు కుమారుడు లోకేష్ కు కానీ లేదన్నారు. సినీపరిశ్రమ వేరు.. రాజకీయాలే వేరుగా చూడాలని చినరాజప్ప హితవు పలికారు. పెద్దాపురంలో ఆదివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీ లో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ వ్యహహారంపై స్పందించారు.