అమరావతి: ఏపీ ఎడ్‌సెట్‌-2018 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ ఎడ్‌సెట్‌ 2018 ఫలితాలను విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు సంబంధించిన ఫలితాలను ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏపీ ఎడ్‌సెట్‌లో 96.75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  ఎడ్‌సెట్‌‌ పరీక్షకు 7,679 మంది అభ్యర్థులు హాజరు కాగా .. 7,430 మంది విద్యార్థులు అర్హత సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో మొత్తం 39 వేల బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ పరీక్షలు వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో జరిగాయి. మార్చి 5న నోటిఫికేషన్ ఇచ్చి, ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించారు. ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ర్యాంక్ కార్డుల కొరకు sche.ap.gov.inను సందర్శించవచ్చు


పరీక్ష ఫలితాల కోసం:


  • అభ్యర్థులు sche.ap.gov.inకు వెళ్లండి.

  • ఏపీ ఎడ్‌సెట్‌-2018 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.

  • రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేయండి.

  • సబ్మిట్ బటన్ నొక్కి, ఎడ్‌సెట్ ఫలితాలను చూసుకోండి.

  • డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసుకోండి.


ర్యాంక్ కార్డు కోసం:


  • అభ్యర్థులు sche.ap.gov.inకు వెళ్లండి.

  • ఏపీ ఎడ్‌సెట్‌-2018 ర్యాంక్ కార్డు లింక్‌పై క్లిక్ చేయండి.

  • హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ తదితర వివరాలను నమోదు చేయండి.

  • వ్యూ యువర్ ర్యాంక్ కార్డు లింక్‌పై క్లిక్ చేసి ర్యాంకు కార్డు చూసుకోండి.

  • డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసుకోండి.