ఎనర్టియా (ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ జర్నల్) 2017 సంవత్సరానికి గాను దేశంలోనే ఉత్తమ సామర్థ్యం గల పవర్ జనరేషన్ కార్పొరేషన్‌గా  ఏపీ జెన్‌కోను గుర్తిస్తూ ఎనర్టియా పురస్కారాన్ని ప్రకటించింది. ప్రకాశ్‌ దివస్‌ సందర్భంగా  హైదరాబాద్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహాయం తోటే విద్యుత్ రంగానికి ఎనలేని ప్రోత్సహం లభిస్తోందని.. జెన్కో వరుసగా అవార్డులను దక్కించుకుంటోందని ఆ సంస్థ ఎండీ విజయానంద్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.


29 డిసెంబరు 1998 తేదిన ప్రారంభమైన ఏపీ జెన్‌కోలో దాదాపు పదివేల మందికి పైగానే ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ విడిపోయాక, ఈ సంస్థ కూడా రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో వేరువేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.