Corona Third Wave: కరోనా మహమ్మారి ఉధృతి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతూ అవసరమైన మౌళిక సదుపాయాల్ని ఏర్పాటు చేసుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి ఏపీలో దాదాపుగా తగ్గడంతో కరోనా థర్డ్‌వేవ్‌ను(Corona Third Wave)దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏ విధమైన మౌళిక వసతుల లేమి లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల స్థాయి నుంచే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్లు చేరుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును పర్యవేక్షించారు. మరోవైపు డీ టైప్ సిలెండర్లను కూడా భారీగా కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ 27 వేల 311 డీ టైప్ సిలెండర్లు చేరుకున్నాయి. 


మరోవైపు రాష్ట్రంలో మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో 146 ఆసుపత్రులు, 6 వేల 151 ఆక్సిజన్ బెడ్స్‌కు అవసరమైన పైప్‌లైన్ ఏర్పాటవుతోంది. ఇందులో సీఎస్ఆర్‌లో భాగంగా మూడు ఆసుపత్రులకు ప్రైవేటు ఆసుపత్రులు చేయూత అందిస్తుండగా..143 ఆసుపత్రులకు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిమిత్తం శాశ్వ త ప్రాతిపదికన కూడా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల(Oxygen plants)నిర్మాణం కొనసాగుతోంది. భవిష్యత్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 


Also read: Zycov D Vaccine: ప్రపంచంలో తొలి డీఎన్ఏ..మేకిన్ ఇండియా వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరికి మార్కెట్‌లో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook