ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మంత్రికు ప్రాణహాని ఉందా..ఇంటెలిజెన్స్ వర్గాలు అవుననే అంటున్నాయి. అందుకే ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది హోంశాఖ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ( Ap Cabinet ) లో కీలకమైన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కన్నబాబు ( Minister kannababu ) కు ప్రాణహాని ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ( Intelligence ) వర్గాలు హెచ్చరించాయి. ఇకపై ఆయన అన్ని పర్యటనలు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని నిఘా వర్గాలు సూచించడమే కాకుండా...వాహనం కేటాయించాలని హోంశాఖకు నివేదించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ( Bullet proof vehicle ) కేటాయించింది హోంశాఖ. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం కన్నబాబు తన పర్యటనలన్నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే జరుపుతున్నారు. మంత్రి కన్నబాబుకు త్రెట్ ఉండటం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Also read: YS Jagan: కోవిడ్‌19పై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం.. కీలక ఆదేశాలు