AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్ కేసుల పెరుగుదల స్థిరంగానే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు ఏపీలో మాత్రం ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 58 వేల 545 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించగా 1184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 11 మంది మరణించారు. గత 24 గంటల్లో 1333 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20 లక్షల 19 వేల 657 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 వేల 136 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 48 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 


రాష్ట్రంలో గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 218, చిత్తూరులో 165, నెల్లూరులో 138, ప్రకాశం జిల్లాలో 114, పశ్చిమ గోదావరి జిల్లాలో 126 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.


Also read: LIC Claim Process: ఎల్ఐసీ డెత్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook